గ్రామంలోకి వస్తే చంపేస్తామని అంటున్నారు.... గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు...
గ్రామంలోకి వస్తే చంపేస్తామని అంటున్నారు.... గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు...
తాడేపల్లి:
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిసిన గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు..
దాదాపు 400 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు, అన్ని కుటుంబాలు మైనారిటీ,ఎస్సీ,బీసీలకు చెందినవే..
వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి సిద్దమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, గ్రామ బహిష్కరణ విషయంపై న్యాయపరంగా హైకోర్టులో కూడా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. …
గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వైయస్ జగన్ హామీ, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా.. ….
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులన్న కారణంతో గ్రామం నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారని వాపోయిన బాధిత కుటుంబ సభ్యులు, వారికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసానిచ్చిన వైయస్ జగన్
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు, వీరితో పాటు తురకపాలెం, మాదెనపాడు,చెన్నాయపాలెం గ్రామాలకు చెందిన మరికొంత మంది కూడా కలిసిన వారిలో ఉన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0