రాష్ట్ర మెడికల్ కాలేజీల్లో పిపిపి విధానంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఈనెల 17వ తేదీ అపాయింట్మెంట్ ఖరారు
రాష్ట్ర మెడికల్ కాలేజీల్లో పిపిపి విధానంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఈనెల 17వ తేదీ అపాయింట్మెంట్ ఖరారు
ఈనెల 17 న గవర్నర్ తో వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ,...
రాజ్భవన్ నుంచి అపాయింట్మెంట్ ఖరారు.
తాడేపల్లి:
రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్ధుల్ నజీర్కు నివేదించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు...
ఆరోజు సా 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ys జగన్, గవర్నర్ ని కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైయస్సార్సీపీకి లేఖ అందింది.
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్ కి చూపించనున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024
Comments 0